Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలువల్లేంకుంటలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీలు.!

వల్లేంకుంటలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీలు.!

- Advertisement -

పట్టించుకోని అధికారులు
బురదమయంగా అంతర్గత రోడ్లు
నవతెలంగాణ – మల్హర్ రావు
: మండల పరిధిలోని వల్లెంకుంట గ్రామంలో మహారాజుల కాలనీ మూడు బజార్ల వద్ద నెలల తరబడి మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ అవుతోంది. ఎన్నిరోజులైనా అధికారులు పట్టించుకోకపోవడంతో మంచినీరు వృధా అవుతోంది. దీంతోపాటు అంతర్గత రోడ్లు బురదమయంగా మారి, దోమల అవాసాలుగా మారుతున్నాయని కాలనీ వాసులు వాపోతున్నారు. మిషన్ భగీరథ పైప్ లైన్ సరి చేయాలని అధికారులకు కాలనీ ప్రజలు మొరపెట్టినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఈ దారిలో వేళ్ళే వాహనాలు బురద వల్ల స్కిడ్ అవుతున్నాయి. దీంతో స్థానికులు, ప్రయాణికులు భయభ్రాంతులు గురవుతున్నారు. ఒకవైపు మిషన్ భగీరథ నీరు ప్రవహించడం, మరో వైపు వర్షపు నీరు రావడంతో రోడ్డుపై చిన్నపాటి కుంటలను తలపించేలా మురుగునీరు పేరుకుపోతోంది. దీనివల్ల సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధించిన ఉన్నతాధికారులు పట్టించుకుని భగీరథ లీకేజీల సరిచేయాలని వేడుకుంటున్నారు. లేదoటే ఆందోళన చేస్తామని అంబేద్కర్ యువజన సంఘంతోపాటు పలువురు  హెచ్చరించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad