![]() |
మహిళలకు చీరలు పంపిణీ చేసిన పులిమల కృష్ణారావు..
నవతెలంగాణ – పెద్దవూర : పెద్దవూర మండల కేంద్రంలోని జాతీయ నాయకుల విగ్రహాల కమిటీ చైర్మన్ మాజీ ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు పులిమల కృష్ణారావు జన్మదిన వేడుకలు ఆదివారం పెద్దవూర కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పులిమల కృష్ణారావు మహిళలకు చీరల పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామ ప్రజల మధ్యల అందరిలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. సమాజంలో అసమానతలు విపరీతంగా పెరిగిపోయాయని అసమానతలు లేని సమాజం పేదరికం లేని సమాజమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని పేర్కొన్నారు. మానవ జీవన ప్రమాణాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయని మానవ లింగ నిష్పత్తిలో కూడా అసమానతలు పెరిగిపోయాయని వీటిని సరి చేయాల్సిన బాధ్యత పాలకవర్గాలపై ఉందని తెలిపారు. సామాజిక న్యాయం మెరుగైన అభివృద్ధి సాధించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆకాంక్షించారు.