Monday, June 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మార్పీఎస్ 30వ ఆవిర్భవ దినోత్సవం ఘనంగా నిర్వహించాలి..

ఎమ్మార్పీఎస్ 30వ ఆవిర్భవ దినోత్సవం ఘనంగా నిర్వహించాలి..

- Advertisement -

మంథని సామ్యల్ మాదిగ 
నవతెలంగాణ – రామారెడ్డి 
: జూలై 7న ఎమ్మార్పీఎస్ 30 వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కామారెడ్డి జిల్లా పర్యవేక్షకులు మంథని సామ్యూల్ మాదిగ ఆదివారం అన్నారు. మండలంలోని ఉప్పల్వాయి, కన్నాపూర్ గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ గ్రామ సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….మాదిగ జాతి వెనుకబడి ఉందని, ఎస్సీల్లో వర్గీకరణ జరగాలని మందకృష్ణ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ 30 సంవత్సరాల క్రితం స్థాపించి, మాదిగల రిజర్వేషన్ల కోసం కృషి చేసిన మహానుభావుడు మందకృష్ణ మాదిగ అని అన్నారు. ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం నాడు ప్రతి గ్రామంలో డప్పుల దరువులతో ఘనంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు కొత్తోల్ల యాదగిరి, అధ్యక్షులు రాజనర్సు, ఉపాధ్యక్షులు శైలేష్, మహిళా నాయకురాలు పద్మ, ఆయాగామాల నూతన కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -