Monday, June 16, 2025
E-PAPER
Homeకరీంనగర్మొదలైన రోడ్డు విస్తరణ పనులు..

మొదలైన రోడ్డు విస్తరణ పనులు..

- Advertisement -

అమరవీరుల స్తూపం నుంచి రాజన్న ఆలయం వరకు కూల్చివేతలు..
260 మంది నిర్వాసితుల్లో 60 మందికి పరిహారం..
పోలీసుల భారీ బందోబస్తు మధ్య వెడల్పు పనులు..
నవతెలంగాణ – వేములవాడ 
: దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి, పట్టణ అభివృద్ధిలో భాగంగా ఆదివారం అమరవీరుల స్థూపం నుండి రాజన్న ఆలయం వరకు విస్తరణ పనులను ఆర్ అండ్ బి శాఖ, మున్సిపల్ అధికారులు విస్తరణ పరులను ప్రారంభించారు. ప్రభుత్వ, దేవాలయం సంబంధించిన సముదాయ దుకాణాలను జెసిబి లతో తొలగించారు.వేములవాడ పట్టణంలో ట్రాఫిక్ సౌలభ్యం కోసం చేపట్టిన మెయిన్ రోడ్ విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మటన్ మార్కెట్ ప్రాంతంలో నిర్మాణాల తొలగింపులో అధికారుల చర్యలు మొదలయ్యాయి. అమరవీరుల స్తూపం నుండి రాజన్న ఆలయం వరకు ఉన్న నిర్మాణాలపై కూల్చివేతలు కొనసాగుతుండగా,2013 భూ సేకరణ చట్టం ప్రకారంగా నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించిన ప్రభుత్వం. 260 మంది నిర్వాసితులలో ఇప్పటి వరకు దాదాపు 60 మంది బాధితులకు ప్రభుత్వం పరిహారం చెల్లించినట్లు సమాచారం. ఇళ్ల స్థలాలు కోల్పోతున్న నిర్వాసితులకు నష్టపరిహారం కింద రూ. 47 కోట్ల 80 లక్షల రూపాయలు కలెక్టర్ ఖాతాలో జమ అయ్యాయని అధికారులు వెల్లడించారు. నిర్వాసితులందరికీ ప్రభుత్వం నష్ట పరిహారం అందజేస్తుందని తెలిపారు. గత 15 రోజుల క్రితమే నిర్వాసితులకు భవనాలు ఇండ్లు ఖాళీ చేయాలని నోటీసులు పంపినట్లుగా అధికారులు తెలియజేశారు.మిగతా నిర్వాసితుల చెక్కులను కోర్టులో జమ చేసినట్లు అధికారులు తెలిపారు.ప్రస్తుతం కూల్చివేతలు మూడు,నాలుగు రోజుల్లో పూర్తికావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజల సహకారం తో ఈ పనులు సాఫీగా జరుగుతున్నాయి. పట్టణ అభివృద్ధి దృష్ట్యా ఈ రహదారి విస్తరణ ముఖ్యమని అధికారులు పేర్కొన్నారు. రోడ్డు వెడల్పులు భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా సుమారుగా 200 మంది పోలీసుల బందోబస్తు మధ్య రోడ్డు విస్తరణ పనులను అధికారులు పనులను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఆర్ అండ్ బి, దేవాలయ, మునిసిపల్ శాఖల అధికారుల పాటు సిబ్బంది తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -