Monday, June 16, 2025
E-PAPER
Homeఆటలుసారథ్యానికి గిల్‌ సిద్ధమే

సారథ్యానికి గిల్‌ సిద్ధమే

- Advertisement -

– జట్టును నడిపించటం అతడికి తెలుసు
– భారత స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌
లండన్‌ (ఇంగ్లాండ్‌):
భారత్‌ టెస్టు క్రికెట్‌ ఆడి ఐదు నెలలైంది. ఈ స్వల్ప సమయంలో డ్రెస్సింగ్‌రూమ్‌లో ఎంతో మార్పు వచ్చింది. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, రవిచంద్రన్‌ అశ్విన్‌లు టెస్టు క్రికెట్‌కు దూరమయ్యారు. కొత్త కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఇంగ్లాండ్‌ పర్యటనలో తొలి పరీక్షకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో భారత స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శుభ్‌మన్‌ గిల్‌ కెప్టెన్సీకి సిద్ధంగా ఉన్నాడని అభిప్రాయపడ్డాడు. ‘ ఓ జట్టును ఎలా ముందుండి నడిపించాలో శుభ్‌మన్‌కు బాగా తెలుసు. కొత కొన్నేండ్లుగా సీనియర్ల దగ్గర గిల్‌ నేర్చుకున్నాడు. గత ఏడాది రోహిత్‌ శర్మతో శుభ్‌మన్‌ గిల్‌ సుదీర్ఘ సంభాషణలు టెస్టుల్లోనే కాదు వన్డేల్లోనూ చూశాం. సీనియర్ల నుంచి అతడు ఎంతో నేర్చుకున్నాడని అనుకుంటున్నాను. ఓ నాయకుడిగా శుభ్‌మన్‌ గిల్‌ ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. డ్రెస్సింగ్‌రూమ్‌ వాతావరణం మెరుగుపర్చేందుకు తపన పడుతున్నాడు. భారత క్రికెట్‌ లీడర్‌షిప్‌ గ్రూప్‌లో చూసిన నాయకత్వ లక్షణాలు.. గత 3-4 సీజన్లలో శుభ్‌మన్‌ గిల్‌లో గమనించాను. భారత్‌కు సారథ్యం వహించేందుకు శుభ్‌మన్‌ గిల్‌ సిద్ధంగా ఉన్నాడు’ అని కుల్‌దీప్‌ యాదవ్‌ అన్నాడు.
రోహిత్‌ స్థానం ఎప్పటికీ తీసుకోను: టీమ్‌ బస్‌లో రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా పక్కన కూర్చుంటారు. రోహిత్‌ వీడ్కోలుతో జడేజా పక్కన ఇప్పుడు కుల్‌దీప్‌ కూర్చుంటున్నాడు. రోహిత్‌ స్థానం తీసుకోవటంపై మీడియా అడిగిన ప్రశ్నకు కులీదీప్‌ యాదవ్‌ ఈ విధంగా బదులిచ్చాడు. ‘రోహిత్‌ శర్మ స్థానం ఎప్పటికీ తీసుకోలేను. జడేజాతో సమయం గడిపేందుకు మాత్రమే ఆయన పక్కన కూర్చుంటున్నాను. అశ్విన్‌ సైతం వీడ్కోలు పలికాడు. జడేజా నుంచి నేర్చుకునేందుకు ఎదురుచూస్తున్నానని’ కుల్‌దీప్‌ తెలిపాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -