Tuesday, June 17, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్‌ విదేశాంగ మంత్రి భారతదేశ దౌత్య కార్యాలయానికి గ్రీన్‌ సిగల్‌

ఇరాన్‌ విదేశాంగ మంత్రి భారతదేశ దౌత్య కార్యాలయానికి గ్రీన్‌ సిగల్‌

- Advertisement -

నవతెలంగాణ – టెహ్రాన్‌ :   ఇరాన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను సురక్షితంగా తరలించాలన్న భారత్ అభ్యర్థనకు ఇరాన్‌ సోమవారం స్పందించింది. ఇరాన్‌ గగనతలం మూసివేయబడినప్పటికీ, విద్యార్థులను సురక్షితంగా తరలించేందుకు వీలుగా అన్ని భూ సరిహద్దులు తెరుచుకున్నాయని తెలిపింది. ప్రస్తుత ఉద్రక్త పరిస్థితులు, దేశంలోని విమానాశ్రయాల మూసివేయడంతో, అనేక దేశాలు తమ దౌత్యవేత్తలను, పౌరులను సురక్షితంగా పంపాలన్న అభ్యర్థనను దృష్టిలో ఉంచుకుని అన్ని భూభాగాల సరిహద్దులు తెరిచి ఉన్నాయని తెలియజేస్తున్నామని విదేశాంగ శాఖ పేర్కొంది. ఈమేరకు ఇరాన్‌ విదేశాంగ మంత్రి భారతదేశ దౌత్య కార్యాలయానికి గ్రీన్‌ సిగల్‌ ఇచ్చారు. దౌత్యవేత్తలు మరియు పౌరులను సురక్షితంగా తరలించేందుకు సహాయం అందిస్తామని తెలిపారు. సరిహద్దులను దాటే వ్యక్తుల పేర్లు, పాస్‌పోర్ట్‌ నెంబర్లు, వాహనాల వివరాలను జనరల్‌ ప్రోటోకాల్‌ విభాగానికి అందించాలని ఇరాన్‌ భారత్‌ను కోరింది. దౌత్యవేత్తలు మరియు ఇతర పౌరుల ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు ప్రయాణ సమయం మరియు ఆ వ్యక్తి ఏ సరిహద్దు నుండి వెళతారో తెలియజేయాలని కోరింది. ఇజ్రాయిల్‌ దాడులు, ఇరాన్‌ ప్రతీకార దాడులతో వేలాది మంది భారతీయులు ఇరాన్‌లోని వివిధ నగరాల్లో చిక్కుకుపోయారు. 1500 మందికి పైగా భారతీయ విద్యార్థులు ఉండగా, వారిలో ఎక్కువమంది జమ్మూకాశ్మీర్‌కు చెందినవారే ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -