– నందిన్నె మహాదేవ్
ధరూర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి ఫలితాలను మంగళవారం విడుదల చేసింది. గద్వాల నియోజకవర్గంలో పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు నందిన్నె మహాదేవ్ శుభాకాంక్షలు తెలిపారు. ఇంటర్ దశ మీ జీవితంలో మలుపు తిరిగే దశ మంచి మార్గం వైపుగా వెళాలని, చెడు వ్యసనాలకు బానిసలూ కాకుండా జీవితంలో ఒక లక్ష్యం ఏర్పర్చుకొని లక్ష్యం సాధించే దిశగా భవిష్యత్లో అత్యున్నత స్థాయికి ఎదిగేవిధంగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. బంగారు భవిష్యత్కు బాటలు వేసుకొనే విదంగా ఉన్నత చదువులు చదివి గద్వాల ప్రాంతానికి, మీ గ్రామానికి, మీ తల్లిదండ్రులకు, మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.