రేపు సీపీఐ(ఎం) సమావేశాన్ని జయప్రదం చేయాలి: చింతల నాగరాజు

నవతెలంగాణ – ఉప్పునుంతల
నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం రేపు సోమవారం వనపర్తి జిల్లా కేంద్రం కామ్రేడ్స్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న జిల్లాల సీపీఐ(ఎం) కార్యకర్తల సమావేశం వనపర్తి జిల్లా కేంద్రంలో ఉదయం 10 గంటలకు జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఎస్ వీరయ్య, కామ్రేడ్ జాన్ వెస్లీ ముఖ్యఅతిథి లుగా పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో మన నాగర్ కర్నూలు జిల్లా నుండి పార్టీ సభ్యులందరూ పాల్గొనాలి. కాబట్టి మీరు వెంటనే అందరికీ సమాచారం ఇచ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేయగలరని చింతల నాగరాజు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఎజెండాగా సంతాప తీర్మానం, పార్లమెంట్ ఎన్నికలు మన కర్తవ్యం అంశాలపై సమావేశం కొనసాగనున్నట్లు తెలిపారు.
Spread the love