బెంగళూరు : కర్నాటక హైకోర్టు శుక్రవారం ఇచ్చిన ఆదేశాలతో ఆ రాష్ట్రంలో బైక్ ట్యాక్సీ సేవలు నిలిచిపోయాయి. సోమవారం ఉదయం నుంచి ర్యాపిడో, ఉబర్, ఓలా సంస్థలు తమ సేవలను నిలిపివేశాయి. హైకోర్టు ఆదేశాలతో తమ సేవలను నిలిపివేస్తున్నట్టు ర్యాపిడో వెల్లడించింది. సేవలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నామని పేర్కొంది. బైక్ ట్యాక్సీ సేవలను ఉబర్ మోటో కొరియర్ కింద మార్చింది. మరో అగ్రిగేటర్ ఓలా తన యాప్లో బైక్ ట్యాక్సీ ఆప్షన్ను తొలగించింది. మోటార్ వెహికల్ చట్టంలో బైక్ ట్యాక్సీల ప్రస్తావన లేకపోవడంతో ఈ సేవలను నిలిపివేయాలంటే కర్ణాటక హైకోర్టు సింగిల్ బెంచ్ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై క్యాబ్ సర్వీసు సంస్థలు సవాలు చేయడంతో డివిజన్ బెంచ్ కూడా సింగిల్ బెంచ్ ఆదేశాలను సమర్థించింది. జూన్ 20లోగా దీనిపై తమ స్పందన తెలపాలని కర్నాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 24కు వాయిదా వేయగా.. తాత్కాలికంగా బైక్ ట్యాక్సీ సేవలు నిలిచిపోయాయి. దీంతో గిగా వర్కర్లు తమ ఉపాధిని కోల్పోయారు.