Tuesday, June 17, 2025
E-PAPER
Homeబీజినెస్జియో సేవలపై వేలాది ఫిర్యాదులు

జియో సేవలపై వేలాది ఫిర్యాదులు

- Advertisement -

– సిగల్‌ అంతరాయంపై ఆందోళన
న్యూఢిల్లీ :
ప్రముఖ ప్రయివేటు టెలికం కంపెనీ రిలయన్స్‌ జియో నెట్‌వర్క్‌లో సోమవారం అంతరాయాలు తలెత్తాయి. ఇంటర్నెట్‌ కనెక్టివిటీ, మొబైల్‌ సిగల్‌, జియో ఫైబర్‌ సేవలకు సంబంధించిన సమస్యలు చోటు చేసుకున్నాయి. దీనిపై వేలాది మంది వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మధ్యాహ్నా సమయంలో జియో సేవలు పొందడంలో ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు వినియోగదారులు సోషల్‌ మీడియాలో ఆందోళన వ్యక్తం చేశారు. 12,000కు పైగా రిపోర్టులు నమోదయ్యాయని అంతరాయాల ట్రాకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ డౌన్‌డిటెక్టర్‌ తెలిపింది. 32 శాతం మంది యూజర్లు కాల్‌ సంబంధిత సమస్యలను ఎదుర్కోగా, 12 శాతం మంది వినియోగదారులు జియో ఫైబర్‌ సేవల్లో అంతరాయం కలిగినట్లు ఫిర్యాదు చేశారు. దీనిపై రిలయన్స్‌ జియో అధికారికంగా స్పందించలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -