
పార్లమెంట్ ఎన్నికల నేపధ్యంలో ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని,అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో శనివారం నుండి నిర్వహిస్తున్న హోమ్ ఓటింగ్ లో 108 పోల్ అయినట్లు అశ్వారావుపేట తహశీల్దార్, మండల ఎన్నికల అధికారి వి.క్రిష్ణ ప్రసాద్ తెలిపారు.నియోజక వర్గంలో వయో అధిక,వికలాంగులు గా నమోదు అయిన మొత్తం 172 మంది ఓటర్లకు గాను మొదటి రోజు శనివారం 108 పోల్ అయ్యాయని వివరించారు. ఈ కార్యక్రమంలో పోలింగ్ ఆఫీసర్ లు గా హెచ్.ఎం హరిత,ఎస్.ఎ రాము,రూట్ ఆఫీసర్ గా వీరయ్య,సెక్షన్ ఆఫీసర్ గా హెచ్.ఓ సందీప్,అబ్జర్వర్ గా సుందర్ తో పాటు ఫొటో గ్రాఫర్ పాల్గొన్నారు.