పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన సీఐ జితేందర్ రెడ్డి 

నవతెలంగాణ – అశ్వారావుపేట

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పలు పోలింగ్ కేంద్రాలను స్థానిక సీఐ జితేందర్ రెడ్డి, ఎస్ఐ శ్రీరాముల శ్రీను పరిశీలించారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలంలోని మేజర్ పంచాయతీ అశ్వారావుపేట,ఐకేపీ కార్యాలయం,ఎం.ఆర్.సీ కార్యాలయం, మండలంలోని పేరాయిగూడెం, రామన్నగూడెం, పండువారిగూడెం తో మరికొన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఆయా కేంద్రాల లో మరుగుదొడ్లు, దివ్యాంగులు కు ర్యాంప్ లు, తాగునీరు, ఇతర సౌకర్యాలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ కృష్ణ, ఐకేపీ ఏపీఎం వెంకటేశ్వరరెడ్డి, బీఎల్వోలు పాల్గొన్నారు.

Spread the love