Wednesday, June 18, 2025
E-PAPER
Homeహైదరాబాద్నీట్‌ ఫలితాల్లో అపోలో మెడికల్‌ అకాడమీ ప్రభంజనం

నీట్‌ ఫలితాల్లో అపోలో మెడికల్‌ అకాడమీ ప్రభంజనం

- Advertisement -

అకాడమీ చైర్మెన్‌ పోసిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి
నవతెలంగాణ-దిల్‌సుఖ్‌నగర్‌:దేశ వ్యాప్తంగా నిర్వహించిన నీట్‌ పరీక్ష ఫలితాల్లో దిల్‌ సుఖ్‌ నగర్‌ అపోలో మెడికల్‌ అకాడమీ ప్రభంజనం సృష్టించి అత్యుత్తమ ర్యాంకులు సాధించిందని అకాడమీ చైర్మెన్‌ పోసిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. అకాడమీ నుంచి అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను సోమవా రం అకాడమీ చైర్మెన్‌ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపోలో అకాడమీ నుంచి 600 మంది నీట్‌కు హాజరవ్వగా 412 మంది విద్యార్థులు మెడికల్‌ సీట్లు అర్హత పొందారని వివరించారు. మొత్తం 720 మార్కులకు గాను తమ అకాడమీ విద్యార్థికి 658 మార్కులు వచ్చాయని ఆయన తెలిపారు. విద్యా విధా నంలో మార్పులకనుగుణంగా అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంతో బోధించడం వలన అనుకున్న ఫలితాలు సాధించామని చెప్పారు. పోటీ ప్రపంచంలో మెడికల్‌ సీటు సాధించడం అంటే విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. దేశ వ్యాప్తంగా జరిగే పరీక్ష కావడంతో విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడ ర్యాంకుల కోసం తీవ్ర ఆందోళనకు గురవుతు న్నారన్నారు. ఒక ప్రణాళికబద్ధంగా విద్యార్థులకు ముందు గా సిలబస్‌ పై అవగాహన కల్పించేందుకు అధ్యాపకులు కషి చేయడంతో విద్యార్థుల్లో నెలకొన్న ఒత్తిడిని తగ్గించే అవకాశం ఉందన్నారు. గతంలో నీట్‌లో మంచి ర్యాంకులు సాధించిన అకాడమీ పూర్వపు విద్యార్థులతో నేడు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారితో గెట్‌ టు గెదర్‌ నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి అధ్యాపకులు అంటే విద్యార్థులు ఇబ్బంది పడతారని అందుకే పూర్వ విద్యార్థులతో ఇంటరాక్షన్‌ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్స్‌పాల్‌ అల్వాల్‌ మధుసూదన్‌ రావు, శ్రీధర్‌, గోవర్ధన్‌ రెడ్డి, కేసీఆర్‌, రాజు, సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -