Saturday, June 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అధికారులు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి

అధికారులు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి

- Advertisement -

ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి
నవతెలంగాణ – తొగుట 
: అధికారులు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురా వాలని ఆత్మకమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం తొగుట రైతు వేదికలో దుబ్బాక డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, డైరెక్టర్ లకు మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానం చేశారు. అనంతరం ఆత్మ కమిటీ ఛైర్మెన్ మాట్లాడుతూ రైతులకు వ్యవసాయ అధికారులు అదు నాతన పద్ధతుల ద్వారా వ్యవసాయం గురించి అవగాహ న కల్పించాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో రైతులు వ్యవసాయం పై మంచి పట్టు సాధించే విధంగా కృషి చేయాలని సూచించారు. ఆత్మ కమిటీ డైరెక్టర్లు రైతులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమమం లో వ్యవసాయ అధికారి మోహన్, విస్తరణ అధి కారులు రాజేష్, సాయి కుమార్, నాగార్జున్, దేవేందర్, ఆత్మ కమిటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -