హైదరాబాద్ : ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్లలో ఒకటైన రాజపుష్ప ప్రాపర్టీస్ నార్సింగిలోని తమ ప్రధాన నివాస సముదాయం రాజపుష్ప ప్రావిన్షియాలో అతిపెద్ద లగ్జరీ క్లబ్హౌస్ క్లబ్ ఒడిస్సీని ఆవిష్కరించింది. దీనిని ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, రాజపుష్ఫ ప్రాపర్టీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి లాంచనంగా ప్రారంభించారు. 1,00,000 పైగా చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న క్లబ్ ఒడిస్సీ, నివాసితుల కోసం ఆరోగ్యం, ఫిట్నెస్, విశ్రాంతి, సాంసృ తిక, సామాజిక, జీవనశైలి కేంద్రంగా మారనుందని పి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఇక్కడి 23.75 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన 3,498 నివాస ప్రీమియం ప్లాట్లలో ఇప్పటికే 95 శాతం విక్రయించామన్నారు.