Thursday, June 19, 2025
E-PAPER
Homeజాతీయంజనగణనలో ఆదివాసీలకు ప్రత్యేక కాలమ్‌ కావాలి

జనగణనలో ఆదివాసీలకు ప్రత్యేక కాలమ్‌ కావాలి

- Advertisement -

– హోం మంత్రి అమిత్‌షాకు ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ లేఖ
కులగణనలో న్యూఢిల్లీ:
దేశంలో 2027లో నిర్వహించే జనగణనలో ఆదివాసీలు/ఎస్‌టిల కోసం ప్రత్యేకంగా కాలమ్‌ను ఏర్పాటు చేయాలని ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ (ఎఎఆర్‌ఎం) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు ఒక లేఖ రాసింది. జన గణన నిర్వహణకు సంబంధించి కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువరించిన నేపథ్యంలో రాష్ట్రీయ మంచ్‌ చైర్‌పర్సన్‌ జితేంద్ర చౌదరి, జాతీయ కన్వీనర్‌ పులిన్‌ బిహారి బాస్కేలు హోం మంత్రికి లేఖ రాశారు. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌కు శాఖలు వున్నాయని, జన గణనలో మత కాలమ్‌లో ఆదివాసీలను కూడా చేర్చాలని డిమాండ్‌ చేశారు. ఇది ఆదివాసీల దీర్ఘకాలిక డిమాండ్‌ అని పేర్కొన్నారు.
ప్రస్తుతం జనగణనలో ఆదివాసీలకు ఎలాంటి గుర్తింపును ఇవ్వకుండా నిరాకరిస్తున్నారు. జనగణనలో హిందూ, ఇస్లాం, సిక్కిజం, క్రైస్తవం, బౌద్ధం, జైన మతాలను ప్రస్తావిస్తున్నారు. ఆదివాసీలను ‘ఇతర మతాలను అనుసరించే వారు’ అనే కాలమ్‌లో చేరుస్తున్నారు. భారత రాజ్యాంగంలో ఆదివాసీలు/ఎస్‌టి జనాభాను గుర్తించారు. వారి గుర్తింపును అంటే వారి మత, ఆధ్యాత్మిక విశ్వాసాలను పరిరక్షించుకునేలా వారికి ప్రత్యేక హక్కులు వున్నాయి. ఆదివాసీల విశ్వాసాలను నమ్మేవారి కోసం వారికి ప్రత్యేకంగా ఒక కాలమ్‌ను ఏర్పాటు చేయకపోవడం ఆదివాసీల కమ్యూనిటీలకు తీవ్రమైన అవమానమని ఆ లేఖ పేర్కొంది. వారి రాజ్యాంగ హక్కులపై దాడి చేయడమేనని విమర్శిం చింది. అందువల్ల 2027లో చేపట్టే జనగణనలో ప్రత్యేకంగా ఆదివాసీలు/ఎస్‌టీ కమ్యూనిటీల కోసం వారి మతవిశ్వా సాలను నమోదు చేయడంకోసం కాలమ్‌ను ఏర్పాటు చేయాలని వారు ఆ లేఖలో డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -