Friday, June 20, 2025
E-PAPER
Homeజిల్లాలుఖాతాల్లో రైతు భరోసా జమా.!

ఖాతాల్లో రైతు భరోసా జమా.!

- Advertisement -

హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
నవతెలంగాణ – మల్హర్ రావు
: రైతులకు పంటల సాగుకు ప్రభుత్వం రైతు భరోసా పథకంతో మద్దతుగా నిలుస్తుందని మండల వ్యవసాయ అధికారి శ్రీజ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వ్యవసాయ రంగంలో రైతులకు వానాకాలం పంట సాగులో పెట్టుబడి అవసరాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతుగా నిలుస్తూ రైతు భరోసా పథకం కింద మండలంలో 6,924 మంది రైతులకు రూ.5,88,25,780 కోట్లు, కాటారం మండలంలో 8,566 మంది రైతులకు రూ.6.92,73,053 కోట్లు లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో జమ చేసిందని తెలిపింది. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని జమ చేస్తుందని తెలిపారు. ఈ క్రమంలో లబ్ది పొందనున్న రైతులు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -