Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మహిళా నాయకత్వాన్ని బలోపేతం చేయాలి

మహిళా నాయకత్వాన్ని బలోపేతం చేయాలి

- Advertisement -

వీ లీడ్ ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్  అంబేద్కర్
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
: గ్రామస్థాయి నుండి మహిళా నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని వీలీడ్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అంబేద్కర్ అన్నారు. గురువారం, యాదగిరిగుట్ట మండలం వంగపల్లి రైతువేదిక, బోస్కో సేవా కేంద్ర, యాత్ర స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో లో జెండర్ సమానత్వం – మహిళా నాయకత్వం – సాధికారతపై  మహిళా నాయకులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాహిళలు విద్యా, ఉద్యోగ రాజకీయ, ఆర్ధికంగా ముందుకు వెళ్లేందుకుగాను ప్రభుత్వాలు అందించే వివిధ పధకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా మహిళల నాయకత్వాన్ని అన్ని స్థాయిల్లో పూర్తి స్వేచ్ఛనిచ్చి బలోపేతం చేయాలన్నారు. ఇందుకోసం బోస్కో సేవా కేంద్రం, వీలీడ్ ప్రోగ్రామ్ ద్వారా మహిళా సాధికారత కోసం శిక్షణలు అవగాహన సమావేశాలు యాత్ర సంస్థ ద్వారా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. రెండో విడత శిక్షణ వచ్చే నెలలో నిర్వహిస్తామని, మహిళలతోపాటుగా యువత, పురుషులకు కూడా వివిధ చట్టాలు, పథకాలపై శిక్షణలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి యాత్ర సంస్థ డైరెక్టర్ సురుపంగ శివలింగం అధ్యక్షత వహించగా వివిధ గ్రామాలనుండి మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad