Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ వైద్యాధికారిపై దాడికి నిరసనగా ర్యాలీ 

 వైద్యాధికారిపై దాడికి నిరసనగా ర్యాలీ 

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు సురేష్ పై జిల్లా కేంద్రంలోని ఇంటి వద్ద మంగళవారం దేవునిపల్లి పిహెచ్సి డిఈఓ రాజు, జుక్కల్ ప్రభుత్వ దావకాన అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న సుభాష్ , సురేష్ ఇంటికి వెళ్లి అసభ్య పదజాలంతో దూషించి, వ్యక్తిగత కారణాలతో, ఆరోపణలు చేస్తే దాడి చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని, జిల్లా అధికారితోపాటు, పోలీసులకు ఫిర్యాదు చేశారని, గురువారం రామారెడ్డి మండల కేంద్రంలో వైద్య సిబ్బంది నిరసన ర్యాలీని చేపట్టారు. దాడికి పాల్పడిన ఇద్దరినీ చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైద్యుల పై దాడిని వారు ఖండించారు. కార్యక్రమంలో అన్నారం, రామారెడ్డి తోపాటు జిల్లాలోని ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad