Friday, June 20, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబదిలీల తర్వాతే పదోన్నతులివ్వాలి

బదిలీల తర్వాతే పదోన్నతులివ్వాలి

- Advertisement -

– విద్యాశాఖ సంచాలకులకు తపస్‌ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో ఉపాధ్యాయులకు బదిలీలు నిర్వహించిన తర్వాతే పదోన్నతులను ఇవ్వాలని తపస్‌ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈ నవీన్‌ నికోలస్‌ను గురువారం హైదరాబాద్‌లో తపస్‌ రాష్ట్ర అధ్యక్షులు హన్మంతరావు, ప్రధాన కార్యదర్శి నవాత్‌ సురేష్‌, రాష్ట్ర కార్యదర్శి లక్ష్మినారాయణ కలిసి వినతిపత్రం అందజేశారు. గెజిటెడ్‌ హెచ్‌ఎం గ్రేడ్‌-2 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. స్కూల్‌ అసిస్టెంట్‌, ఎస్జీటీలకు పదోన్నతులను బదిలీలు చేపట్టాలని సూచించారు. ఉద్యోగ విరమణ ద్వారా చాలా ఖాళీలు ఏర్పడ్డాయనీ, వాటిని భర్తీ చేయడం ద్వారా విద్యావ్యవస్థ బలోపేతం అవుతుందని తెలిపారు. ప్రాథమిక పాఠశాలల్లో ఒకటి నుంచి 30 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులను ఇవ్వాలని పేర్కొన్నారు. 31 నుంచి 60 మంది వరకు కనీసం ముగ్గురు టీచర్లు, 60 మంది కంటే ఎక్కువ విద్యార్థులున్న చోట తరగతికి ఒక టీచర్‌ ఉండేలా సర్దుబాటు చేయాలని డిమాండ్‌ చేశారు. వంద మంది విద్యార్థులున్నచోట ఐదుగురు ఉపాధ్యాయులు, ఒక హెచ్‌ఎం ఉండాలని సూచించారు. ఉపాధ్యాయుల సర్దుబాటు చేసే క్రమంలో సీనియర్‌, జూనియర్‌ విషయంలో నిర్ణయాధికారం సీనియర్‌ టీచర్‌కే ఇవ్వాలని కోరారు. సాంకేతిక కారణాలతో ఆగిన పరస్పర బదిలీలను పూర్తి చేయాలని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం అమలు బాధ్యత అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అప్పగించాలని సూచించారు. ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలను ఆ బాధ్యతల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఉపాధ్యాయులు దీర్ఘకాలిక సెలవులో వెళ్తే ఆ స్థానంలో విద్యావాలంటీర్‌ను నియమించాలని పేర్కొన్నారు. తరగతుల అప్‌గ్రేడ్‌ కోసం దరఖాస్తు చేసుకు న్న పాఠశాలలకు వెంటనే అనుమతులివ్వాలని తెలిపారు. వాటిలో ఉపా ధ్యాయ పోస్టులను మంజూరు చేయాలని పేర్కొన్నారు. ఈ సమస్యలను పరిశీలిస్తామంటూ విద్యాశాఖ సంచాలకులు హామీ ఇచ్చారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -