- Advertisement -
నవతెలంగాణ – కంటశ్వర్ : మాదిగ ఉద్యోగుల సమాఖ్య నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాకు నూతనంగా విచ్చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రమోషన్స్, విద్యా రంగంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు నూతి పల్లి మారుతి, జాతీయ నాయకులు తెడ్డు గంగారం, రాష్ట్ర ఉపాధ్యక్షులు రేణిగుంట నాంపల్లి, సిలుమల సురేష్, పూల గుచ్చంతో వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎం ఇ ఎఫ్ నాయకులు సహదేవ్, భూమన్న, సిహెచ్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -