అది ప్రతిఒక్కరి జీవితంలోనూ భాగస్వామ్యం కావాలి
ఎల్బీ స్టేడియంలో జరిగిన యోగా కౌంట్డౌన్ వేడుకల్లో కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం సాధ్యమని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి చెప్పారు. అది ప్రతి ఒక్కరి జీవితంలోనూ భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. యోగా దినోత్సవం శనివారం జరుగనున్న నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో యోగా 24 గంటల కౌంట్డౌన్ వేడుకలను నిర్వహించారు. అందులో మాజీ రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఎంపీ ఈటల రాజేందర్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ జాతీయ నేత ఖుష్భూ, సినీ నటులు సాయి దుర్గాతేజ్, తేజా సజ్జ, మీనాక్షి చౌదరి, తదితరులు పాల్గొని యోగాసనాలు వేశారు. యోగ ఆవశ్యకత గురించి చెప్పారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ… ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన అద్భుత బహుమతి యోగా అని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు, ఆ దేశాధినేతలు, ఆ దేశాల ప్రభుత్వాల ఆధ్వర్యంలో యోగాను గుర్తించి, ఆచరిసు ్తన్నారని గుర్తుచేశారు. ఇది ప్రతి భారతీ యుడు గర్వించదగిన అంశమని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సంద ర్భంగా శనివారం విశాఖ పట్నంలో ఐదు లక్షల మందితో కలిసి యోగాలో పాల్గొ నబోతున్నందుకు సంతో షంగా ఉందన్నా రు. యోగానే ప్రథమ డాక్టర్ అనీ, సర్వరోగ నివారిణి అని నొక్కి చెప్పారు. యోగా పాటించినట్లయితే జీవితంలో మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. యోగాను ప్రతిఒక్కరూ ఆచరించాలని కోరారు.
యోగాతో మానసిక,శారీరక ఆరోగ్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES