మేలో కీలక రంగాల ఉత్పత్తి మందగింపు
న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థలో మందగమనం స్పష్టమవుతోంది. ఈ ఏడాది మేలో అత్యంత కీలకమైన ఎనిమిది ప్రధాన పరిశ్రమల రంగాల ఉత్పత్తి పడకేయడమే ఇందుకు నిదర్శనం. గడిచిన నెలలో మౌలిక వసతుల రంగాలు ఉత్పత్తి ఏకంగా 0.7 శాతానికి మందగించినట్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ఇది తొమ్మిది నెలల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. సిమెంట్, ముడి చమురు, సహజ వాయువు, ఎరువులు, విద్యుత్, బొగ్గు, స్టీల్, రిఫైనరీ తదితర ప్రధాన రంగాలు గతేడాది ఇదే మేలో ఏకంగా 6.9 శాతం వృద్థిని కనబర్చాయి. ఇంతక్రితం 2024 ఆగస్టులో అత్యల్పంగా మైనస్ 1.5 శాతం వృద్ధి చోటు చేసుకుంది. ఆ తర్వాత భారీ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో వీటి వాటా 40.27 శాతంగా ఉంది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ముడి చమురు, సహజ వాయువు, ఎరువులు, విద్యుత్ రంగాల ఉత్పత్తి భారీగా పడిపోయింది. ఈ ఏడాది మేలో సిమెంట్ రంగం 9.2 శాతం వృద్ధిని కనబర్చింది. స్టీల్ ఉత్పత్తి 6.7 శాతంగా పెరిగింది. బొగ్గు, రిఫైనరీ ఉత్పత్తులు వరుసగా 2.8 శాతం, 1.1 శాతం చొప్పున రాణించాయి. ముడి చమురు ఉత్పత్తి 1.8 శాతానికి మందగించింది. సహజ వాయువు 3.6 శాతానికి తగ్గింది. ఎరువుల ఉత్పత్తి 5.9 శాతానికి, విద్యుత్ 5.8 శాతానికి పరిమితమయ్యాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ నుంచి మే కాలంలో కీలక రంగాల ఉత్పత్తి ఏకంగా 0.8 శాతానికి క్షీణించింది. ఇంతక్రితం ఏడాది ఇదే సమయంలో 6.9 శాతం రికార్డ్ వృద్ధి చోటు చేసుకుంది. అధిక ధరలు, నిరుద్యోగం, ప్రజల ఆదాయాలు తగ్గడం తదితర పరిణామాలు వస్తు డిమాండ్ను దెబ్బతీస్తున్నాయి. దీంతో కొనుగోళ్లు తగ్గుతున్నాయి. ఈ ప్రభావం కీలక మౌలిక వసతుల రంగాల ఉత్పత్తిపై ప్రభావం చూపుతుతున్నాయని తెలుస్తోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పరిశ్రమలు, ఉపాధి మరింత దెబ్బతినె అవకాశాలున్నాయి.
9 నెలల కనిష్టానికి..
- Advertisement -
- Advertisement -