మోడీపై తేజస్వియాదవ్ ఫైర్
పాట్నా : ప్రధాని మోడీ ప్రజలకు అన్నీ అబద్దాలు చెబుతూ వారిని మోసగిస్తున్నారని బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వియాదవ్ ఫైర్ అయ్యారు. ఆయన చేసిన ప్రసంగాల్ని.. ఒక్కసారి వింటే మోడీనే ఎంతో ఇబ్బందికి గురవుతారు. ఎందుకంటే బీహార్లో రెండు వందల ర్యాలీల్లో పాల్గొని ఆయన చేసిన ప్రసంగాల్లో చెప్పిన మాటలన్ని పచ్చి అబద్దాలే అని తేజస్వియాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
నేడు ప్రధాని బీహార్లో శరన్ను సందర్శించనున్నారు. మౌలిక సదుపాయాలు, సామాజిక, ఆర్థిక అభివృద్ధి ప్రోత్సాహక ప్రాజెక్టుల్లో భాగంగా.. ఈరోజు మోడీ బీహార్లో సివాన్లోని పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా బీహార్లో పర్యటించనున్న ప్రధాని మోడీనుద్దేశించి తేజస్వియాదవ్ తీవ్రంగా ఆరోపించారు. పదకొండు సంవత్సరాల మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో 20 సంవత్సరాల ఎన్డీఏ పాలన బీహార్లో ఉన్నప్పటికీ నిటి అయోగ్, భారత ప్రభుత్వ నివేదికల్లో పేదరికం, నిరుద్యోగం, తలసరి ఆదాయం, పెట్టుబడి, అక్షరాస్యత రేటు, పారిశ్రామికీకరణపరంగా బీహార్ ఎందుకు వెనకబడిందో వివరించగలరా అని తేజస్వియాదవ్ మోడీని ప్రశ్నించారు. 20 ఏండ్ల ఎన్డీఏ పాలనలో 6,500 మంది అమాయక ప్రజలు ఎందుకు చనిపోయారు? దాన్ని వివరిస్తారా? అని మోడీని అడిగారు. రాష్ట్రం ఇలా అన్నింటిలో వెనకబడినప్పటికీ ‘జాతీయ దామాద్ అయోగ్’ సభ్యులనే మీరు సత్కరిస్తారా? ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గురించి మీరు ఒకసారి మాట్లాడిన విధంగానే బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ స్పృహలేని స్థితి గురించి మాట్లాడతారా? లేక మిత్రులు నామినేట్ చేసిన వారిని జేపీ అల్లుళ్లుగా గౌరవిస్తారా? అని ఆయన మోడీని ప్రశ్నించారు. బీహార్లో 20 ఏండ్ల ఎన్డీఏ పాలనలో 20కి పైగా స్కామ్లు, 20 లక్షల కోట్లు దోచుకున్నారని తేజస్వి ఆరోపించారు. బీహార్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడే వారి సొంత ఖర్చులతో ర్యాలీలకు జనాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను వేధిస్తున్నారని ఆరోపించారు. ఉగ్రవాదాన్ని మట్టుబెడతామని, ఉగ్రవాదులకు సరైన గుణపాఠం చెబుదామని చెబుతున్న మోడీ.. అమెరికా అధ్యక్షుడు ఆదేశాలతో ఆపరేషన్ సింధూర్ని నిలిపివేశారు. మరి ఇలా చేస్తే.. భారత సైన్యంలో ధైర్యవంతులైన సైనికులెందుకు? అని తేజస్వి మోడీని ఎక్స్ పోస్టులో ప్రశ్నించారు.
మీ ప్రసంగాలు మీకే ఇబ్బంది
- Advertisement -
- Advertisement -