నవతెలంగాణ – హైదరాబాద్ : డీఎస్సీ ద్వారా త్వరలో టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం రవీంద్రభారతిలో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పదో తరగతి ప్రభుత్వ పాఠశాలల టాపర్ విద్యార్థుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వందేమాతరం ఫౌండేషన్ను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమని తెలిపారు.