Sunday, June 22, 2025
E-PAPER
Homeజాతీయంఏడాది పాల‌న‌లో ఒడిశాకు సున్నా నిధులు: BJD

ఏడాది పాల‌న‌లో ఒడిశాకు సున్నా నిధులు: BJD

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఒడిశాలో బీజేపీ ఏడాది పాల‌న‌పై బిజు జనతా దళ్(BJD) నేత భృగు బాక్సీపాత్ర తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా.. రాష్ట్ర అభివృద్ధికి స‌మృద్దిగా నిధులు కేటాయించ‌లేద‌ని ఆరోపించారు. గ‌త పాల‌నతో పోల్చుకుంటే ప్ర‌స్తుత సంవ‌త్సారానికి నిధుల కేటాయింపులు తగ్గాయ‌ని ఆయ‌న వివ‌రించారు. రాష్ట్రంలో బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్నా కేంద్ర ప‌థ‌కాల‌కు మొండిచేయి చూపించార‌ని మండిప‌డ్డారు. మోడీ ప్ర‌భుత్వం గొప్ప‌గా చెప్పుకునే కేంద్ర ప‌థ‌కాలైనా..పీఎం ఆవాస్ యోజ‌న‌, జ‌ల్ జీవ‌న్ మిష‌న్ స్కీంల‌కు జీరో నిధులు కేటాయించార‌ని ఆరోపించారు. బీజేపీ ఏడాది పాల‌నలో ఒడిశాకు ఆశించిన స్థాయిలో కేంద్ర నిధులు, అభివృద్ధి జ‌గ‌ర‌లేద‌న్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నాయని, మ‌హిళ‌ల‌కు,పిల్ల‌ల‌కు రోజ‌రోజుకు భ‌ద్ర‌త క‌రువైంద‌న్నారు. గ‌డిచిన ఏడాదిలో 15 లైంగిక దాడులు, 26వేల పైగా FIRs న‌మోదైయ్యాయ‌ని తెలిపారు. గత సంవత్సరంలో, మహిళలు పిల్లలపై అత్యాచారాలలో ఒడిశా అగ్రస్థానంలో ఉంద‌ని ఆయ‌న తెలియ‌జేశారు.

రాష్ట్రంలో పెట్టుబడులు నిలిచిపోయాయని, గత సంవత్సరం రూ.37,000 కోట్లుగా ఉన్న పెట్టుబడులు ఈ సంవత్సరం రూ.40 కోట్లకు గణనీయంగా తగ్గాయని చెప్పారు. ఐదేండ్ల పాల‌న‌లో ఒక సంవత్సరం పూర్తయింది, కానీ ఒడిశాకు ఎటువంటి ప్రయోజనాలు లభించలేద‌ని బీజేపీ ప్ర‌భుత్వంపై భృగు బాక్సీపాత్ర మండిప‌డ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -