నవతెలంగాణ – హైదరాబాద్: పోచారం మున్సిపాలిటీలోని కొర్రెముల ఏకశిలా నగర్ లో సర్వే నెంబర్ 740, 741, 742 లలో 7.16 ఎకరాల భూమి తనదేనంటూ నూనె వెంకటనారాయణ అనే వ్యక్తి చెబుతున్నాడు. తప్పుడు పత్రాలతో భూమిని ఆక్రమించి ఏడెకరాల చుట్టూ ప్రహారీ నిర్మించాడని ఫ్లాట్ యజమానుల సంఘం హైడ్రాకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఈ ఫ్లాట్ ల్యాండ్ ను వ్యవసాయ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయించారని అసోసియేషన్ సభ్యులు ఆరోపిస్తున్నారు. మేమంతా రికార్డులను పరిశీలించాకే ఫ్లాట్ లను కొనుగోలు చేశామని అసోసియేషన్ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనంతరం మాకు మీరే న్యాయం చేయాలని హైడ్రాకు విన్నవించుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా సదరు ప్రహారీ గోడను కూల్చి వేసింది. హైడ్రా చర్యలతో సదరు ఫ్లాట్స్ ఓనర్స్ సంతోషం వ్యక్తం చేశారు. దీనిపై నూనె వెంకట నారాయణ స్పందిస్తూ.. అధికారులు పత్రాలను పరిశీలించకుండానే ప్రహారీ గోడను కూలగొట్టారని ఆవేదన చెందారు.
పోచారం మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా కూల్చివేతలు
- Advertisement -
- Advertisement -