నవతెలంగాణ – ఆర్మూర్: విద్యార్థులకు లక్ష్యం ఉండాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ అన్నారు. గంజాయి, మత్తు పదార్థాల పైన పెర్కిట్ లోని మోడల్ స్కూల్, జూనియర్ కాలేజ్ లోనే సోమవారం జూనియర్ కాలేజ్ పిల్లలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసి, విద్యార్థులకు లక్ష్యం అనేది ఉండాలని, చెడు వ్యసనాలకు లోను కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చెప్పిన విధంగా మంచిని గ్రహించి, మనకు ప్రభుత్వం ద్వారా అందించే సౌకర్యాలను వినియోగించుకుని, ప్రయోజకులు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్యాం, ఐసిడిఎస్ సూపర్వైజర్ ఏ. శ్రీదేవి, నలిని, షీటీం సమత, డిహెచ్ఈడబ్ల్యూ పుష్ప, స్కూల్ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు లక్ష్యం ఉండాలి: ఎస్హెచ్ఓ సత్యనారాయణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES