Tuesday, June 24, 2025
E-PAPER
Homeజిల్లాలుమహిళలపై దారుణాలు.. బాధితులకు పరిహారం చెల్లింపు సమావేశం 

మహిళలపై దారుణాలు.. బాధితులకు పరిహారం చెల్లింపు సమావేశం 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : పోక్సో చట్టం 2015 సి ఆర్ పి సి (అట్రాసిటీ బాధితుల పరిహారం) మహిళలు, బాలికలపై జరిగిన దారుణాలకు గురైన బాధితులకు పరిహారం చెల్లింపును ఖరారు చేయడానికి జిల్లా స్థాయి కమిటీ సమావేశం సోమవారం టి. వినయ్ కృష్ణ రెడ్డి, జిల్లా కలెక్టర్, నిజామాబాద అధ్యక్షతన సంబందిత కార్యాలయ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి, మహిళా, శిశు దివ్యాంగుల, వయో వృద్దుల సంక్షేమ శాఖ జి.ఓ.యామ్.యస్.నో.28, తేదీ:13.06.2011 ప్రకారం జిల్లాలో పోక్సో చట్టం 2015 సిఆర్పిసి(అట్రాసిటీ బాధితుల పరిహారం) క్రింద నమోదు అయినటువంటి అర్హత కలిగిన మొత్తము 86 కేసెస్ (పోక్సో చట్టం 2015 క్రింద 57, మహిళా రేప్ కేసెస్ 12, వరకట్న మరణాలు 4, కిడ్నాప్ కేసులు 13) బాధితులకు పరిహారం చెల్లింపును యొక్క వివరాలను జిల్లా స్థాయి కమిటీకి తెలియజేశారు.

తదుపరి జిల్లా కలెక్టర్, నిజామాబాద్  అర్హత కలిగిన మొత్తము 86 కేసెస్ వివరాలను తెలుసుకున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆద్వర్యంలో బాధితులకు అందించే సేవల గురించి చర్చించడం జరిగినది. బాధితులకు పరిహారం చెల్లింపును త్వరతగతిగా అందించాలని జిల్లా సంక్షేమ అధికారి, మహిళా, శిశు దివ్యాంగుల మరియు వయో వృద్దుల సంక్షేమ శాఖ, నిజామాబాద్ కి ఆదేశాలు జారీచేసియునారు. అర్హత కలిగిన మొత్తము 86 కేసులను జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమోదించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఆఫ్ పోలీసు, పి.సాయి చైతన్య, ప్రాజెక్టు డైరెక్టర్, డి.ఆర్.డి.ఓ. డి.సాయ గౌడ్ , డా. రాజశ్రీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, జిల్లా విధ్య అదికారి అశోక్, జిలా సంక్షేమ అధికారిణి ఎస్.కే. రసూల్ బీ, ఎన్‌జి‌ఓ స్నేహ సొసైటి కార్యదర్శి  యస్. సిద్దయ్య, పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -