Sunday, July 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ గణేష్ ఉత్సవ కమిటీ ఏకగ్రీవ ఎన్నికలు..

 గణేష్ ఉత్సవ కమిటీ ఏకగ్రీవ ఎన్నికలు..

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌన్ :  ఆలేర్ పట్టణంలో ఆదివారం   క్రాంతి నగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  గణేష్ ఉత్సవ కమిటీ సమావేశం నిర్వహించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా  వినీత్ సామల ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా, కొమ్ము శ్రవణ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ  గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత సంవత్సరాల కంటే మరింత వైభవంగా, భక్తిశ్రద్ధలతో, ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలియజేశారు.

క్రాంతి నగర్ ప్రజలు, యువత, దాతలు మరియు భక్తులందరూ ఈ మహోత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు. ఏకగ్రీవంగా ఎన్నికైన ఇరువురిని కిలిమంజారో శిఖర అధిరోహితుడు   బీర్కూరి ప్రదీప్ శాలువాలతో ఘనంగా సన్మానించారు.  శుభాకాంక్షలు తెలియజేశారు. గణేష్ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు సభ్యులు  కృత నిశ్చయంతో పని చేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -