- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొన్ని రోజులుగా క్షిపణులతో దాడులు చేసుకుంటున్న ఇరుదేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియా ‘ట్రూత్’లో మంగళవారం వేకువ జామున 3.32 (భారత కాలమానం) గంటలకు పోస్టు చేశారు. దీంతో 12 రోజులుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు దొరికినట్లైంది. మరికొన్ని గంటల్లోనే కాల్పుల విరమణ జరుగనుంది. 24 గంటల తర్వాత యుద్ధం అధికారికంగా ముగియనున్నట్లు ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ట్రంప్ రెండు దేశాలను అభినందించారు.
- Advertisement -