Wednesday, June 25, 2025
E-PAPER
Homeతాజా వార్తలురాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులకు అందించాలి..

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులకు అందించాలి..

- Advertisement -

– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం..
నవతెలంగాణ-మునుగోడు: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లను రాజకీయ జోక్యం లేకుండా , అర్హులైన లబ్ధిదారులకే  మంజూరు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం డిమాండ్ చేశారు . బుధవారం మండల కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం  ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లను అధికార పార్టీ నాయకుల జోక్యంతో అర్హులైన లబ్ధిదారులకు అందాల్సిన సంక్షేమ పథకాలు అందన ద్రాక్షల మరవని ఆరోపించారు . అర్హులైన లబ్ధిదారులకు అందించే విధంగా అధికారుల పర్యవేక్షణలో సంక్షేమ పథకాలను అందించాలని డిమాండ్ చేశారు . రేషన్ కార్డ్ కోసం  దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులందరికీ రేషన్ కార్డులన మంజూరు చేయాలని కోరారు. నిరుద్యోగుల కు స్వయం ఉపాధి కోసం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస్ పథకం లో అధికార పార్టీ నాయకులు తమకు అనుకూలంగా ఉన్న వారికి అందించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అధికారులు తీపి కొట్టి , స్వసక్తిగా ఎదిగేందుకు ఎదురుచూస్తున్న అర్హులైన నిరుపేదలకు అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల రెండు లక్షల లోపు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ చేయకుండా కాలయాపన చేయడం దారుణమని మండిపడ్డారు . 2 లక్షల లోపు ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్న గ్రామాలలో ప్రజలకు  అవసరమైన వసతులు లేక అవస్థలు పడుతున్నారని అన్నారు . స్పెషల్ అధికారుల పాలనలో ప్రజా సమస్యలు గ్రామాలలో తీవ్రంగా పెరిగిపోయాయని  పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి గ్రామాలలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

 ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్ , మండల కమిటీ సభ్యులు మిర్యాల భరత్ , యాస రాణి శ్రీను , వేముల లింగస్వామి , శివర్ల వీరమల్లు , యాట యాదయ్య, పగడాల కాంతయ్య , కొంక రాజయ్య, దొండ వెంకన్న ,  తదితరులున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -