Thursday, June 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి : మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బుధవారం వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించారు. బషీరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తో పాటు పలు ప్రభుత్వ పాఠశాలల్లో జూన్ 26 అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం పురస్కరించుకొని ఈ వ్యాసరచన, వక్తృత్వ  పోటీలను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. యువతపై మాదకద్రవ్యాల ప్రభావం  అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించారు. పాఠశాలలో నిర్వహించిన పోటీలను పోలీస్ సిబ్బంది స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం ఆయా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్ఐ అనిల్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గంగాధర్, మధుపాల్, ఉపాధ్యాయులు, ఫిజికల్ డైరెక్టర్ రమేష్ గౌడ్, విద్యార్థులు, తదితరులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -