- Advertisement -
నవతెలంగాణ – వలిగొండ రూరల్
హాస్టళ్లలో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందజేయాలని మండల విద్యాధికారి భాస్కర్ అన్నారు. బుధవారం మండలంలోని లోతుకుంటలో గల కస్తూరిబా బాలికల పాఠశాల, మోడల్ స్కూల్ వసతి గృహాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి నిర్వాహకులతో మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం నిర్వహించిన మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని, నాణ్యమైన వంట సరుకులను వాడాలని, పరిసరాలను పరిశుబ్రముగా ఉంచుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు దుర్గ, రహీమున్నీసా, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -