కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలపై మంత్రి శ్రీధర్బాబు అసంతృప్తి
రాష్ట్రంలోని పలు రంగాల అభివృద్ధి సహకారంపై కేంద్ర మంత్రులతో చర్చలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమని రాష్ట్ర ఐటీ, పరిశ్ర మల, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు విమర్శిం చారు. బుధవారం నాడిక్కడ కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, అశ్వినీ వైష్టవ్, కుమారస్వామిలతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులను అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 గురించి సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రిని కలిసి విజ్ఞాపనలు ఇచ్చినప్పటికీ కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకోలేదన్నారు. పూర్తిస్థాయి డీపీఆర్ కేంద్రానికిచ్చామని, ఈ కేబినెట్లో అనుమతి వస్తుందని భావించామన్నారు.
రేర్ ఎర్త్ ఎగుమతులపై, పారిశ్రామిక రంగాభివృద్ధిపై..
రేర్ ఎర్త్ ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడంతో తెలంగాణ తయారీ రంగంపై తీవ్ర ప్రభావం చూపు తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖమంత్రి అశ్విని వైష్టవ్తో శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. ఈ ఆంక్షల విషయంలో తక్షణ జోక్యం కా వాలని కోరారు. పలు ప్రముఖ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహ నాల తయారీ కంపెనీలు రేర్ ఎర్త్ మాగెట్లు, కీలక ముడి పదార్థాలు, రసాయనాల దిగుమతుల్లో చైనాపై ఆధారప డటం వల్ల తీవ్ర అవరోధాలు ఎదుర్కొంటున్నామని తెలిపా రు. ప్రస్తుత పరిస్థితి ఉత్పత్తి స్థాయితోపాటు ఉపాధి అవకా శాలపైనా ప్రభావం చూపే ప్రమాదం ఉన్నందున ప్రత్యా మ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు.
రాష్ట్రంలో పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభి వృద్ధికి కేంద్రం సహకారం అందించాలని పీయూష్ గోయల్ ను కోరారు. పలు ఇండిస్టీయల్ కారిడార్ల అభివృద్ధి వివ రాలు ఆయనకు తెలిపారు. జహీరాబాద్లోని ఇండిస్టీయల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక సదుపాయాలకు రూ.400 కోట్ల నిధులు పీఎం గతిశక్తి పథకం కింద మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల హైదరాబాద్-వరంగల్ ఇండిస్టీయల్ కారిడార్ (హెచ్డబ్ల్యూఐసీ) నిలిచిపోయిందని, అందులో భాగమైన ఫార్మా సిటీని ప్రభుత్వం ఇప్పుడు ‘ఫ్యూచర్ సిటీ’గా అభివృద్ధి చేస్తోందని తెలిపారు. అందులో భాగంగానే వరంగల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి సహా పలు నోడ్స్కు కేంద్రం నిధులు విడుదల చేయాలని కోరారు. కేంద్రం ప్రతిపాదించిన 100 పారిశ్రామిక పార్కుల పథకంలో తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఇప్పటికే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తమ అభిప్రాయాలు పంపినట్టు గుర్తు చేశారు.
జాతీయ డిజైన్ సెంటర్ ఏర్పాటుకు
హైదరాబాద్లో జాతీయ డిజైన్ సెంటర్ (ఎన్డీసీ) ఏర్పాటు చేస్తే దేశవ్యాప్తంగా డిజైన్ థింకింగ్కు కేంద్రంగా మారుతుందని వివరించారు. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేస్తోందని, కేంద్రంతో కలిసి వికసిత్ భారత్ 2047 లక్ష్యం సాధనలో రాష్ట్రం ముందుంటుందని మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు.
భూ సమస్యల పరిష్కారానికి..
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు గతంలో కేటాయించిన భూములపై నెలకొన్న సమస్యలను పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ విషయంపై కేంద్ర భారీ పరిశ్రమల శాఖమంత్రి కుమారస్వామితో మంత్రి శ్రీధర్బాబు భేటీ అయ్యారు. 1960ల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు హైదరాబాద్ చుట్టుపక్కల విలువైన భూములను భారీ ఎత్తున రాయితీ ధరలకే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిందని గుర్తుచేశారు. కాలక్రమంలో వాటిలో అనేక సంస్థలు మూతపడి, ఉత్పత్తులు నిలిచిపోయాయని తెలిపారు. అటువంటి భూములను ప్రస్తుతం వాణిజ్య పరంగా వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు.
జిల్లాల్లోని ముఖ్యమైన సీపీఎస్యూల పరిధిలోని భూకేటాయింపుల వివరాలు
– హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్, మేడ్చల్-మల్కాజిగిరి – 324.87 ఎకరాలు
– హిందుస్తాన్ ఫ్లోరోకార్బన్స్ లిమిటెడ్, సంగారెడ్డి – 126.33 ఎకరాలు
– ఐడీపీఎల్, మేడ్చల్-మల్కాజిగిరి – 551.03 ఎకరాలు
హెచ్ఎంటీ, మేడ్చల్-మల్కాజిగిరి – 888.05 ఎకరాలు
– సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), ఆదిలాబాద్ – 2,272.85 ఎకరాలు
– ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఎద్దుమైలారం, సంగారెడ్డి – 3,020 ఎకరాలు
ఈ భూములు ఉపయోగంలో లేకపోవడంతో పాటు పెట్టుబడులు ఉపసంహరించుకుంటుండటం, ప్రత్యామ్నాయ ప్రణాళికలు లేకపోవడం రాష్ట్రాభివృద్ధికి ఆటంకమని మంత్రి స్పష్టం చేశారు. సరైన పరిహారం లేకుండానే భూములను ప్రయివేట్ కంపెనీలకు బదిలీ చేయడం రాష్ట్రానికి నష్టమని అభిప్రాయపడ్డారు. ఈ సమస్యల పరిష్కారానికి కేంద్రం ప్రత్యేక దష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
మెట్రో ఫేజ్-2 ఇయ్యలే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES