రాజ్ గురు బ్యానర్ పై దయానంద్ గడ్డం రచనా దర్శకత్వంలో రాజా దారపునేని నిర్మిస్తున్న చిత్రం ‘వర్జిన్ బార్సు’. జూలై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలోని ‘దం దిగా దం..’ పాటను బుధవారం మేకర్స్ రిలీజ్ చేశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ చిత్రంలోని పాటలు మార్కెట్లోకి విడుదలయ్యాయి.
ఈ సందర్భంగా నిర్మాత రాజా దారపనేని మాట్లాడుతూ, ‘ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్తో, తాజాగా రిలీజైన పాటకు మంచి స్పందన లభించింది. సినిమా యూత్ఫుల్గా ఉంటుంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు బాగుందని ప్రశంసించారు. సినిమాలో వినోదంతో పాటు మంచి లవ్ స్టోరీ కూడా ఉంది. ‘ఏ’ సర్టిఫికెట్ పొందిన మా చిత్రాన్ని నైజాంలో ఏషియన్ సునీల్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు’ అని తెలిపారు.
‘సినిమా చూస్తున్నంత సేపూ మీ కాలేజీ రోజులు గుర్తొస్తాయి. మా నిర్మాత రాజా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. సంగీత దర్శకుడు స్మరణ్ సాయి బిజీఎంతో పాటు ఆరు పాటలను అద్భుతంగా కంపోజ్ చేశారు. ఓ మంచి సినిమాతో మీ ముందుకు రాబోతున్నాం’ అని దర్శకుడు దయానంద్ గడ్డం చెప్పారు.
కాలేజీ రోజుల్ని గుర్తు చేసే సినిమా
- Advertisement -
- Advertisement -