యూపీలో ఇంటర్నేషనల్
పొటాటో సెంటర్ ఏర్పాటు
కేంద్ర మంత్రివర్గం ఆమోదం
వివరాలు వెల్లడించిన
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పూణే మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్-2ను కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది. బుధవారం నాడిక్కడ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ బాధితులకు నివాళిగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించి, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించింది. శుభాంశు శుక్లాతో కూడిన మిషన్ విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశించడాన్ని స్వాగతిం చింది. అనంతరం నేషనల్ మీడియా సెంటర్లో జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించారు.
పూణే మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్-2కు సంబంధిచి ఈ రెండు ఎలివేటెడ్ కారిడార్లు 12.75 కిలో మీటర్లు విస్తరించి ఉంటాయనీ, 13 స్టేషన్లు ఉంటాయని అన్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.3,626.24 కోట్లని, ఈ వ్యయాన్ని కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వం సమానంగా పంచుకుంటాయని తెలిపారు. చాందినీ చౌక్, బవ్ధాన్, కోత్రుడ్, ఖరడి, వాఘోలి వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాలను కలుపుతాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును నాలుగేండ్లలోపు పూర్తి చేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. అలాగే జార్ఖండ్లోని ఝారియా బొగ్గు గనుల నిర్వాసితుల పునరావాసానికి (ఝరియా మాస్టర్ ప్లాన్) రూ. 5,940.47 కోట్లు కేటాయించినట్టు పేర్కొన్నారు. నిర్వాసిత కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన కల్పించడం కోసం నైపుణ్య శిక్షణ, స్థిరమైన ఉపాధి అవకాశాలను కల్పించనున్నట్టు పేర్కొన్నారు.ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలోని సింగ్నాలో ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ (సిఐపి) దక్షిణాసియా ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి తెలిపారు. దీనికి రూ. 111.5 కోట్లు కేటాయించిందని, ఆహారం, పోషకాహార భద్రత, రైతుల ఆదాయం, ఉపాధి కల్పనను పెంచడం దీని ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగాళాదుంప ఉత్పత్తి చేస్తున్న దేశం భారత్ కాగా, ఇందులో ఉత్తరప్రదేశ్ ముందు వరుసలో ఉందని తెలిపారు. పొటాటో సెంటర్ ఏర్పాటుతో బంగాళాదుంప ఉత్పత్తి, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, రవాణా, మార్కెటింగ్, విలువ, గొలుసులో గణనీయమైన ఉపాధి అవకాశాలను సృష్టించే సామర్థ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. అలాగే, యూపీలో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. యూపీలోని గౌతమ్ బుద్ధనగర్లో రూ.417 కోట్లతో ఈఎంసి క్లస్టర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
యోగాంధ్ర విజయవంతం: ప్రధాని మోడీ
యోగాంధ్ర విజయవంతం అయిందని ప్రధాని మోడీ అన్నారు. యోగాంధ్రను విజయవంతానికి కృషి చేసిన చంద్రబాబు, లోకేశ్కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకూ నేను ఎన్నో కార్యక్రమాలను చూశానని, కానీ యోగాంధ్ర లాంటి అతి భారీ కార్యక్రమాన్ని చూడలేదని అన్నారు. ఏపీలో నెల రోజుల పాటు యోగాంధ్రను నిర్వహించడం మర్చిపోలేని విషయమని తెలిపారు. 30 రోజుల పాటు సమాజంలోని అన్ని వర్గాల వారీని కలిపి యోగాంధ్రను ఎలా చేశారో నివేదిక ఇవ్వాలని ఏపీని కోరామని అన్నారు. ఏపీ నుంచి యోగాంధ్ర నివేదిక వచ్చిన తరువాత దాన్ని అన్ని రాష్ట్రాలకు పంపుతామన్నారు.
పూణేె మెట్రో -2 ఫేజ్కు ఆమోదం
- Advertisement -
- Advertisement -