నవతెలంగాణ-హైదరాబాద్: ఇజ్రాయిల్- ఇరాన్ల మధ్య యుద్ధం ముగిసిన తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చలు జరపనున్నారు. బహుశా వచ్చే వారంలో ఇరాన్ అధికారులతో చర్చలు జరిపే అవకాశం ఉందని ట్రంప్ బుధవారం వెల్లడించారు. నిన్న నెదర్లాండ్లోని హేగ్లో నాటో దేశాధినేతలు, ప్రభుత్వాధినేతల శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ట్రంప్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మేము ఒక ఒప్పందంపై సంతకం చేసుకోవచ్చు. దానిపై పూర్తి స్పష్టత లేదు. ఒప్పందం చేసుకోవచ్చు. అయినా అంత అవసరం లేదని నేను అనుకుంటున్నాను’ అని ఆయన అన్నారు. అమెరికా, ఇరాన్లు చర్చలు జరుపుకున్నప్పటికీ.. అణు సమస్యపై చర్చలు జరుగుతాయా? లేదా శాంతి ఒప్పందంపై జరుగుతాయా అనేది స్పష్టత లేదు. అయితే ఇరాన్తో ఒక కుప్పందం కుదుర్చోకున్నట్లు.. దాన్ని రూపొందించమని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కె రూబియోను కోరినట్లు ట్రంప్ చెప్పారు.
అయితే ఇరాన్-ఇజ్రాయిల్ దేశాల మధ్య 12 రోజుల పాటు భీకర దాడులు చేసుకున్నాయి. బుధవారం రెండు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ అంగీకారంతో ప్రస్తుతానికి పశ్చిమాసియాలో యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ పడిన విషయం తెలిసిందే.