ప్రపంచ సగటు కంటే రెట్టింపు బీసీజీ రిపోర్ట్
ముంబయి : భారత్లో ఓ వైపున పేదలు, మధ్య తరగతి ప్రజల ఆదాయాల్లో పెద్ద పురోగతి లేకపోగ.. అధిక ధరలతో ఉన్న ఆదాయాలు తరిగిపోతున్నాయి. మరోవైపు ధనవంతులు మరింత సంపన్నులు అవుతున్నారు. ఐదేండ్లలో దేశంలో సంపన్నులు రెట్టింపు కానున్నారని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) ఓ రిపోర్ట్లో వెల్లడించింది. ఆ వివరాలు.. 2024-2029 మధ్య భారత్లో సంపన్నుల జనాభా 55 శాతానికి పైగా పెరుగుతుందని అంచనా. ఇది ప్రపంచ సగటు 21 శాతంతో పోల్చితే రెట్టింపు కావడం విశేషం. 2023, 2024లో భారత ఆర్థిక సంపద 10.8 శాతం పెరిగింది. ఆసియా-పసిఫిక్ సగటు 7.3 శాతంగా ఉంది. ఉత్తర అమెరికాలో సంపద పెరుగుదల 4 శాతం, పశ్చిమ ఐరోపా 5 శాతం చొప్పున నమోదయ్యింది. కాగా 2029 నాటికి ఆసియా-పసిఫిక్ ప్రాంతం వార్షిక సంపద పెరుగుదల 9 శాతంగా ఉండొచ్చు.
”2024 నుంచి 2029 వరకు డాలర్ మిలియనీర్ల సంఖ్య 55 శాతానికి పైగా పెరగొచ్చని అంచనా. ముఖ్యంగా యువ పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ లీడర్లు పరిశ్రమను కొత్త పుంతలు తొక్కించనున్నారు. బలమైన ఈక్విటీ మార్కెట్ పనితీరు కారణంగా ఆర్థిక ఆస్తులు 8.1 శాతం పెరగడంతో 2024లో ఆర్థిక సంపద రికార్డు స్థాయిలో 305 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.” అని బిసిజి మేనేజింగ్ డైరెక్టర్, పార్టనర్ మయాంక్ ఝా తెలిపారు.