- Advertisement -
హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా అత్యంత సమయపాలన పాటించే విమానయాన సంస్థల జాబితాలో ఎయిర్ ఇండియా నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. జూన్ 2026లో ట్రాక్ చేసిన 15,135 విమానాలలో ఎయిర్ ఇండియా 86.85 శాతం ఆన్ టైమ్ రాకను నమోదు చేసినట్టు సిరియం నివేదిక వెల్లడించింది. నెట్వర్క్ ప్లానింగ్లో మార్పులు, విమానాల ఆధునీకరణ ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని పేర్కొంది. ఈ ఏడాది చివరి నాటికి 50 శాతం వైడ్బాడీ విమానాలు కొత్త ఇంటీరియర్స్తో అందుబాటులోకి రానున్నాయని సంస్థ తెలిపింది.
- Advertisement -



