జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు మెనూ ప్రకారం పోష్టికాహారం అందించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. శుక్రవారం మోత్కూరు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన పథకం కింద మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగారు. దీనికి ప్రతిస్పందనగా మంచి రుచికరమైన భోజనం అందిస్తున్నారని విద్యార్థులు తెలిపారు. మెనూ ప్రకారమే ప్రతిరోజూ ఆహారాన్ని అందించాలని సంబంధిత అధికారులను కోరారు. వంట గదిని ఎప్పటికపుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పాఠశాల పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న అన్ని సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటూ.. ఉన్నత స్థాయికి ఎదిగి, తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకరావాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంట మోత్కూరు ఎమ్మార్వో జ్యోతి, సంబంధిత అధికారులు ఉన్నారు.
మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES