Saturday, June 28, 2025
E-PAPER
Homeసినిమాసరికొత్త అనుభూతినిచ్చే 'తమ్ముడు'

సరికొత్త అనుభూతినిచ్చే ‘తమ్ముడు’

- Advertisement -

‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్‌ బస్టర్‌ తర్వాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ నిర్మాణంలో వస్తున్న మరో చిత్రం ‘తమ్ముడు’. తాజాగా సెన్సార్‌ ముగించుకున్న ఈ చిత్రానికి నిర్మాత దిల్‌ రాజు ‘ఎ’ సర్టిఫికెట్‌ ఎంచుకున్నారు. కట్స్‌తో ఈ సినిమాకు ‘యు/ఎ’ సర్టిఫికెట్‌ లభించేది. అయితే ప్రేక్షకులకు బెస్ట్‌ థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చేందుకు ఆయన ‘ఎ’ సర్టిఫికెట్‌ తీసుకున్నారు అని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఇటీవల ‘తమ్ముడు’ మూవీ కోసం చేసిన ఇంటర్వ్యూస్‌లో దిల్‌రాజు ఏ తరహా సినిమాలు ప్రేక్షకాదరణ పొందు తున్నాయో స్పష్టంగా చెప్పారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి కంప్లీట్‌ ఎంటర్‌టైనర్స్‌ లేదా సరికొత్త సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే సినిమాలకు మాత్రమే ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు ఒక కొత్త తరహా సినిమాటిక్‌ అనుభవాన్ని ప్రేక్షకులకు అందించేందుకు కట్స్‌ లేకుండా ‘ఎ’ సర్టిఫికెట్‌ తీసుకునేందుకే దిల్‌ రాజు మొగ్గుచూపారు. చాలా కాలం తర్వాత ఈ సినిమాతో నటి లయ రీ ఎంట్రీ ఇస్తున్నారు. నితిన్‌ కెరీర్‌లోనే ది బెస్ట్‌ సినిమాగా ఇది నిలుస్తుందని అని మేకర్స్‌ తెలిపారు. దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహించారు. నితిన్‌, లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ నటించిన ఈ చిత్రాన్ని జూలై 4న వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -