నవతెలంగాణ-హైదరాబాద్ : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు అధికారులు తెలిపారు. సోమవారం నుంచి 20 వరకు జరిగే పరీక్షలు రెండు సెషన్లలో జరుగుతాయని వెల్లడించారు. ఉదయం ఫస్టియర్ విద్యార్థులకు, మధ్యాహ్నం సెకండియర్ వారికి పరీక్షలుంటాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 933 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. మొత్తం 4,12,325 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ఇందులో 2,70,583 (ఫస్టియర్), 1,41,742 (సెకండియర్) మంది విద్యార్థులు ఉన్నారని చెప్పారు. పరీక్షాకేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకోవాలని సూచించారు.