Sunday, June 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ గ్రామాధ్యక్షుడుగా రాజునాయక్

కాంగ్రెస్ గ్రామాధ్యక్షుడుగా రాజునాయక్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, టీపీసీసీ ప్రదాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు, డీసీసీ అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి, మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆదేశాలతో భూపాలపల్లి కాంగ్రెస్ ఎస్సిసెల్ అధ్యక్షుడు, దండు రమేష్ ఆధ్వర్యంలో శనివారం మండలంలోని మల్లారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మల్లారం గ్రామశాఖ అధ్యక్షుడుగా భూక్య రాజునాయక్, ఉపాధ్యక్షుడుగా దేనవేన సత్యనారాయణ, ప్రధానకార్యదర్శిగా పొల్సాని రవీందర్ రావు, సంయుక్త కార్యదర్శిగా బిల్లకంటి స్వామిరావు, కోశాధికారిగా నక్క బొంద్యాలు, ప్రచార కార్యదర్శిగా మాదరపు రాజు, అధికార ప్రతినిధిగా తోట సమ్మయ్య, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గా లింగన్నపేట శేఖర్ ఎన్నికయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలో కష్టపడి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని నూతనంగా ఎన్నికైన కమిటీకి దిశ నిర్దేశం చేసి, కమిటీకి రమేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నేరేడుగొమ్మ రాజేశ్వర్ రావు, అవిర్నేని ప్రకాష్ రావు, అవిర్నేని రూపేష్ రావు, లింగన్నపేట మురళి, రెవెళ్లి లింగయ్య, లింగన్నపేట రమేష్, మేకల రాజయ్య, లింగన్నపేట శ్రీధర్, ముక్కేనవేన ఐలయ్య, ముంజం శంకర్, గుగులోత్ బలరాం నాయక్, పెరుక సురేష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -