- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : కాలుష్యం పెరిగి నగరాల్లో జీవించలేని పరిస్థితి వచ్చిందని సీఎం రేవంత్ అన్నారు. హైదరాబాద్ అలా కాకుండా నాలాలు, చెరువుల కబ్జాలకు విముక్తి కల్పిస్తున్నట్లు చెప్పారు. ‘హైడ్రా ద్వారా చెరువులను రక్షిస్తున్నాం. హీరో నాగార్జున N-కన్వెన్షన్ను కూల్చాం. ఆ తర్వాత ఆయనే స్వయంగా చెరువుకు ఆనుకుని ఉన్న 2 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించి నిజమైన హీరోగా నిలిచారు. మా పనితీరును మెచ్చుకున్నారు’ అని సీఎం రేవంత్ వివరించారు.
- Advertisement -