నవతెలంగాణ-హైదరాబాద్: ప్రముఖ టీవీ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ మృతి పట్ల నవతెలంగాణ తీవ్ర సంతాపం తెలియజేసింది. శనివారం ఆ సంస్థ జనరల్ బాడీ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా స్వేచ్ఛ అకాల మరణం పట్ల సంస్థ సిబ్బంది మౌనం పాటించారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ప్రజా క్షేత్రంలో విలువలతో కూడిన జర్నలిజానికి పాటుపడిందని, ఆమె సేవలు మరవలేనివని నవతెలంగాణ పత్రిక యాజమాన్యం కొనియాడింది. జర్నలిస్టు హోసింగ్ సొసైటీ ఎన్నికల్లో ఈసీ మెంబర్ గా ఆమె సేవలు అందించారని గుర్తు చేశారు. హైదరాబాద్ చిక్కడపల్లి పీఎస్ పరిధిలోని జవహర్ నగర్ కాలనీలోని తన నివాసంలో..వ్యక్తగత కారణాలతో స్వేచ్ఛ వోటార్కర్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.
