బీసీ సంఘం నేత విజయగిరి సమ్మయ్య నాయీ
నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ ఉద్యమకారుల ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యమం చేశారని,ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు సమయంలో దాదాపు 1200 మంది పైగా ప్రాణ త్యాగం చేశారని వారి త్యాగానికి చట్టబద్దత ప్రభుత్వ కల్పించాలని జాతీయ బిసి సంఘం భూపాలపల్లి జిల్లా ఇంఛార్జి విజయగిరి సమ్మయ్య నాయి శుక్రవారం ఒక ప్రకటన డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్ పార్టీయేన్నారు.ఉద్యమంలో అన్ని కుల సంఘాలు,ప్రజా సంఘాలు,రాజకీయ నాయకులు,అన్ని వర్గాల ప్రజలు,ఉద్యోగులు సకల జనుల సమ్మె లో పాల్గొన్నారని తెలిపారు.ఉద్యమకారులను గుర్తింపు చేపట్టిన ప్రభుత్వానికి సీఎం రేవంత్,మంత్రి వర్గానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ నెల 28న నిర్వహించే ఉద్యమకారుల కార్యక్రమాన్నీ విజయవంతం చేయాలన్నారు.
తెలంగాణ ఉద్యమకారుల త్యాగానికి చట్టబద్ధమైన గుర్తింపు దక్కాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


