- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని మండలం బట్టుపల్లి గ్రామానికి చెందిన బందెల పద్మ-లక్ష్మణ్ దంపతుల ద్వితీయ పుత్రుడు బందెల కౌశిక్ జెఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో ఆల్ ఇండియా 450వ ర్యాంక్ సాధించి, ఐఐటీ బొంబాయిలో సీటు పొందారు. ఈ సందర్భంగా శుక్రవారం కౌశిక్ మండల కేంద్రమైన తాడిచెర్లలోని కాపురంపల్లి గ్రామానికి వచ్చిన నేపథ్యంలో ఆదివాసీ నాయకపోడు సంఘం సేవ నాయకురాలు శైలజ, శీలం రమేష్ ఆధ్వర్యంలో కౌశిక్ ను శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు కౌశిక్ సాధించిన విజయం ఆదివాసీలకు గర్వకారణమని పేర్కొన్నారు.
- Advertisement -



