Sunday, June 29, 2025
E-PAPER
Homeక్రైమ్కోర్టు భవనం పై నుండి దునికి దంపతుల ఆత్మహత్య

కోర్టు భవనం పై నుండి దునికి దంపతుల ఆత్మహత్య

- Advertisement -

భార్య అక్కడికక్కడే మృతి, పిల్లలకు, భర్తకు కు తీవ్ర గాయాలు
కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు
నవతెలంగాణ — మెదక్ ప్రాంతీయ ప్రతినిధి

జిల్లా కోర్టు పై దునికి నుండి ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం నాడు రాత్రి మెదక్ జిల్లా కోర్టులో చోటు చేసుకుంది…. ఘటన స్థలాన్ని కోర్టు ఉన్నతాధికారులతో పాటు డిఎస్పి సిఐలు సందర్శించారు. ప్రాథమిక వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లాకు పరిధిలో గల దౌల్తాబాద్ మండలానికి చెందిన రమ్య నవీన్ దంపతులకు ఇద్దరు పిల్లలు. గతంలో కుటుంబ కలహాలతో రమ్య నవీన్ మధ్య గొడవ జరిగి రమ్య తల్లి గారి ఇంటిని తగలబెట్టిన సంఘటనలో నవీన్ నిందితుడు. ఈ కేసులో నవీన్ బైకు మొబైలు పోలీసులు స్వాధీనం చేసుకుని పై కేసు పెట్టారు ఈ విషయంలో మెదక్ జిల్లా కోర్టుకు శనివారం నాడు చేరుకున్న నవీన్ రమ్య దంపతులు కోర్టు ప్రాంగణంలో గొడవపడి తన బైకు సెల్ఫోన్ ఇవ్వడం లేదని మూడంతస్తుల జిల్లా కోర్టు పై నుండి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో రమ్య అక్కడికక్కడే మరణించక చిన్నారులు తీవ్ర గాయాలకు గురి కాగా వారిని హైదరాబాద్కు మెరుగైన వైద్యం కోసం తరలించారు. నవీన్ కు తీవ్ర గాయాలు కావడంతో మెదక్ లోని ఏది ఆసుపత్రిలోని చికిత్స నిమిత్తం పోలీసులు తరలించారు. ఈ విషయంలో అధికారులు పూర్తి స్థాయిలో వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -