Monday, June 30, 2025
E-PAPER
Homeఆటలుసెమీస్‌లో నిఖత్‌ జరీన్‌

సెమీస్‌లో నిఖత్‌ జరీన్‌

- Advertisement -

– జాతీయ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్స్‌
హైదరాబాద్‌:
హైదరాబాద్‌ వేదికగా జరుగుతున్న జాతీయ సీనియర్‌ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్స్‌లో తెలంగాణ స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ సెమీఫైనల్‌కు చేరుకుంది. 51 కేజీల విభాగంలో పోటీపడిన నిఖత్‌ జరీన్‌ 5-0తో కల్పన (శారు)పై ఏకపక్ష విజయం సాధించింది. యూత్‌ వరల్డ్‌ మాజీ చాంపియన్‌ అంకుషిత బోరో 65 కేజీల విభాగంలో 5-0తో రాజస్థాన్‌ బాక్సర్‌ను చిత్తు చేసి సెమీఫైనల్లో ప్రవేశించింది. 48 కేజీల విభాగంలో తెలంగాణ బాక్సర్‌ మహి వజీర్‌ 0-5తో మంజు రాణి చేతిలో ఓటమి చెందింది. 54 కేజీల విభాగంలో తెలంగాణ బాక్సర్‌ నిరుపమ 0-5తో పరాజయం పాలైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -